Monday 28 December 2015

జీలకర్ర (Cumin)

cumin (జీలకర్ర)

  • వాంతులు:- తేనె 20 గ్రాములు, దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3 గ్రాములు  కలిపి ఒక మోతాదుగా రోజుకు 3 నుండి 5 సార్లు వ్యాధి తీవ్రతను బట్టి వాడుతూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.
  • ఉబ్బురోగం:- జీలకర్రను నీటిలో తడిపి, తర్వాత దాన్ని నూరి రసం తీసి ప్రతి 8 గంటలకోసారి తాగితే ఉబ్బురోగం తగ్గిపోతుంది.
  • కడుపు నొప్పి:- ఒక అర చెంచా జీలకర్ర లేదా వాము బాగా నమిలి మింగితే కాసేపటికి కడుపు నొప్పి తగ్గిపోతుంది.
  • జలుబు:- రెండు కప్పుల నీటిలో కొద్దిగా జీలకర్ర, అల్లం, తులసి ఆకులు వేసి మరిగించి ఆ కషాయం తాగితే జలుబు నుండి త్వరగా ఉపసమనం పొందే వీలుంటుంది.
  • అరికాళ్ళ మంటలు:-  సోంపు - 50 గ్రా., జీలకర్ర - 50 గ్రా., ధనియాలు - 50గ్రా. ఈ మూడింటిని చూర్ణం చేసుకుని సీసాలో భద్రపరచుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక గ్లాసు మరుగుచున్న నీటిలో వేసి ఒక పొంగు వచ్చేవరకు కాచి వడబోయాలి. వడబోసిన నీటిని గోరువెచ్చగా అయ్యేవరకు చల్లార్చి త్రాగవలెను. ఇలా రోజు ఉదయం, రాత్రి తీసుకుంటే అరికాల్లమంటలు తగ్గిపోయే అవకాశం చాలా ఉంది.



శరీర దుర్వాసన (Body Odour)


Body Odour (శరీర దుర్వాసన)

  • నల్ల ఉలవల పొడి  100 గ్రాములు, మెంతుల పొడి 100 గ్రాములు, కస్తూరి పసుపు పొడి 100 గ్రాములు, బావంచాల పొడి 100 గ్రాములు, కరక్కాయల బెరడు పొడి 100 గ్రాములు, కచ్చూరాల పొడి 100 గ్రాములు
తయారు చేయు విధానం: పైన తెలిపిన అన్ని పొడులను కలిపి ఒక డబ్బాలో తీసి పెట్టుకోవాలి. మిశ్రమం చేసిన పొడిలో కొంచెం నువ్వుల నూనె కాని, పాలు కాని కలిపి ప్రతి రోజు స్నానానికి అరగంట ముందు మీ చర్మానికి పూసుకొని తరువాత స్నానం చేయాలి. ఇలా 30 రోజులు చేస్తే మీ శరీర దుర్వాసన మటుమాయం అవుతుంది.

మొటిమలు (PIMPLES)

Pimples (మొటిమలు)
  • రేగి పండు గింజలు పగులగొట్టి అందులోని పప్పును తీసుకుని పొడి చేసుకోవాలి. దానిలో తగినంత వెన్న , కొద్దిగ తేనె కలిపి మెత్తగ నూరి మొటిమల మీద, మొటిమల వల్ల కలిగిన మచ్చల మీద వ్రాయాలి,ఎండి పోయాక గోరు వెచ్చటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా 40 రోజులు చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
  • దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును మొటిమలు ఉన్నచోట పూయటం వలన మొటిమలు తగ్గిపోయి మచ్చలు కూడా రాకుండా చేస్తుంది.

కీళ్ళ నొప్పి (Joint Pain)

Joint Pain (కీళ్ళ నొప్పి)


  • కరక్కాయ పొడి, శొంఠిపొడి, వామును వేయించి చేసిన పొడి ఒక్కొక్కటి 5౦గ్రాములు మరియు 15౦ గ్రాములు బెల్లం అన్ని కలిపి దంచి గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ నిల్వ ఉంచిన పొడిని ఉదయం మరియు సాయత్రం పూటకు గచ్చకాయంత పరిమాణంలో చప్పరించి మింగాలి. తర్వాత 1౦౦ మి.లీ.ల గోరువెచ్చని నీరు లేదా పాలు త్రాగాలి. రోజూ ఈ విధంగా చేయడం వలన కీళ్ళనొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
కావలసిన పదార్థాలు:- ఆముదము చెట్టు వేర్లు 1 కిలో, ఆముదము 5౦౦ గ్రా., నీరు 4 రెట్లు.

చేసె విధానం: ఆముదం తోలు 5౦౦ గ్రా. ఒక పాత్రలో వేసి అందులో నాలుగు రెట్లు నీరు అనగా 2 కి.గ్రా. వేయాలి. దానిని పొయ్యి మీద సన్నటి సెగ మీద పెట్టి, అర కిలో నీరు మిగిలె వరకు మరిగించి, దానిని దించి, వడపోయాలి. దీనిని మళ్ళి పొయ్యి మీద పెట్టి అర కిలో ఆముదము పోసి,సన్నట్టి సెగ మీద మరిగించి, నీరు అంత ఆవిరి అయ్యి పోయక ఆముదము మాత్రమే మిగలాలి, తరవాత దానిని దించి, వడపోసుకొని దానిలో మిరియాల పొడి 10 గ్రాములు, పిప్పళ్ళ పొడి 10 గ్రాములు, ముద్ద కర్పూరం 30 గ్రాములు, కాచిన ఆముదములో వేసి బాగా కలిపి, చల్లార్చి గాజు సీసాలో నిల్వచేసుకోవాలి.
ఉపయోగించే విధానం: దీనిని గోరు వెచ్చగ చేసుకొని ఎక్కువగ కీళ్ళ నొప్పులు వున్న చోట నెమ్మదిగ మర్ధన చేసి తరువాత పాత ఇటుక రాయి ని దంచి పొడి చేసి బాండిలో వేయించి, దానిని ఒక గుడ్డలో చుట్టి, మసాజ్ చేసిన చోట కాపడం పెట్టాలి. ఆ తరవాత చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యాలి. 

Wednesday 16 December 2015

దాల్చిన చెక్క (Cinnamon) (दालचीनी)


Cinnamon (దాల్చిన చెక్క)

  • 2 గ్రాములు దాల్చిన చెక్క, 1 గ్రాము యాలిక గింజలు, కొద్దిగా శొంటి పొడి, 2 గ్రాముల  తాటి కలకండ వేసి అందులో కొద్దిగా నీరు పోసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి.ఈ కషాయాన్ని సేవించడం వలన ఉదర సంబంధ వ్యాధులు తగ్గి పోతాయి.
  •  అరస్పూను దాల్చిన చెక్క పొడి, ఒక స్పూను తేనెతో కలిపి తీసుకోవడం వలన హృదయ నాళాల్లో కలిగే బ్లాక్స్ (Coronary artery disease) ను తొలగిస్తుంది. 
  • దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును మొటిమలు ఉన్నచోట పూయటం వలన మొటిమలు తగ్గిపోయి మచ్చలు కూడా రాకుండా చేస్తుంది.
  • దాల్చిన చెక్క పొడి, తేనె కలిపిన పేస్టును కీళ్ళనొప్పులు (Arthritis) ఉన్నచోట పూతగా వాడటం వలన కీలనొప్పులు, వాపులు తగ్గిపోతాయి.

Tuesday 15 December 2015

ఉదర సంబంధమైన వ్యాధులు

Stomach Pain (కడుపు నొప్పి)

  • శొంటిని నేతిలో వేయించి చూర్ణం చేసుకోవాలి. ఒక కప్పు శొంటి చూర్ణానికి నాలుగు కప్పుల నేతిని, పదహారు కప్పుల నీటిని కలిపి నీళ్లన్నీ ఆవిరై పోయి నెయ్యి మాత్రం మిగిలే వరకూ కాచాలి. దీనిని దించి వడగట్టి ఒక సీసాలో భద్రపరచుకోవాలి. దీనిని ప్రతిరోజూ రెండు పూటలా ఒక చెంచా చొప్పున పంచదార కలుపుకొని భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వలన తరచుగా విరేనాలు కావడం, కామెర్లు, రక్తక్షీనత, కడుపునొప్పి, అజీర్తి వంటి ఉదర సంబంధ వ్యాధులు నివారింపబడతాయి.

Monday 14 December 2015

అరటి (Banana)

అరటి (Banana )

  • లేతగా ఉన్న అరటికాయను చిన్న చక్రాలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా పొడి చెయాలి. ఈ పొడిని బెల్లం పాకం లేదా తేనెతో కలిపి తీసుకుంటుంటే జిగురు విరేచనాలు ఆగిపొతాయి. 
  • ముదిరిన అరటి కాయను చక్రాలుగా తరిగి ఎండబెట్టి మెత్తగా పొడి చెయాలి. ఈ పొడిని రోజూ సేవించడం వలన హెర్నియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది . 
  • కూర అరటికాయను చిన్న చిన్న చక్రాలుగా కోసి ఎండబెట్టి మెత్తగా పొడిచేయాలి . ఈ పొడిని రోజూ తీసుకోవడం వలన స్త్రీలలో తెల్లబట్ట వ్యాధికి చక్కగా పనిచేస్తుంది .  అలాగే గర్భ సంబంధ వ్యాధులు తొలగిపోతాయి . 
  • అరటి ఆకులలో భోజనం చేయడం వలన మూత్ర సంబంధ వ్యాధులు, రక్తపోటు (B.P.), మధుమేహం (Sugar) క్రమంగా తగ్గుముఖం పడతాయి . అరటి ఆకులో భోజనం చేయడం వలన మూత్ర పిండాలలో రాళ్ళు ఉన్న వారికి మరియు మూత్ర పిండ సంబంధ వ్యాధులు ఉన్నవారికి చాలా ఉపయుక్తం.  

చనుల వాపు (Breast Swelling)


  • నల్ల ఉమ్మెత్త ఆకులను వేడిచేసి పట్టువేసి కట్టినట్లయితే చనులవాపు తగ్గే అవకాశం ఉంది.
  • ప్రతి పూట మూడు నీరుల్లి రెబ్బలను నమిలి మింగాలి. దీనితో పాటు చనులకు వేడినీటి కాపడం పెడుతుండాలి.

Friday 11 December 2015

తాంబూలం (PAN) కిళ్ళీ

తాంబూలం (PAAN)
ఆహారము సేవించిన తరువాత తాంబూలము సేవించుట మంచిది ,ఆరోగ్యకరమైనది.తాంబూలము సేవించినట్లయితే, మనము తీసుకున్న ఆహారమునందలి విష పదార్ధములను నిర్వీర్యము చేయును.
తాంబూలము సేవించుట వలన జీర్ణ శక్తి అభివృద్ధి పరచును, దంత పుష్టి కలుగును. ఎప్పటికి చెడుపు కలుగనీయదు. తాంబూలము నోటికి చురుకుదనము, సువాసనను ఇచ్చును, ముఖమునకు కాంతిని కలిగిస్తుంది. స్వరాపేటిక, నాలిక, దంతముల యందు మలినము పోగొట్టును. అధికముగా నోటి యందు ఉమ్మి  రావటాన్ని తగ్గించును.
హృదయమునకు మేలు చేయును. ఉష్ణమును కలుగ చేయును. కారము, చేదు, ఉప్పు, వగరు రసములను కలిగి యుండుటచే మలబద్దకమును పోగొట్టును.
సంబోగమునందు ఆసక్తి కల్గించును. కొన్ని సమయములందు పిత్తమును వృద్ధి చేయును. ఆరోగ్యజీవితము, ధారనా శక్తి,  జ్ఞాపక శక్తి, బుద్ధి, ఆకలి కలిగించును.

Thursday 3 December 2015

పసుపు (Turmeric)

పసుపు (Turmeric)

మధుమేహం:- మంచి పసుపు, ఉసిరిక కాయ బెరడు చూర్ణము ఈ రెండూ సమభాగాలు కలిపి చూర్ణం చేసి రోజు 2 పూటలా 10 గ్రాములు మోతాదుగా మంచి నీళ్ళతో సేవిస్తూ వుంటే క్రమంగా మధుమేహం తగ్గుముఖం పడుతుంది.

కాలి పగుళ్ళు:- మనదరికి తెలుసు ఏ శుభకార్యం  అయినా ఆడవారు కాళ్ళకు పసుపు పట్టించుకుంటుంటారు. కాళ్ళకు పసుపు పట్టించుకోవడం  వలన  కాళ్ళ పగుళ్ళకు చక్కని పరిష్కారం దొరుకుతుంది. కాళ్ళను శుభ్రంగా నీటితో కడిగి పొడి బట్టతో తుడిచి  పసుపు మరియు ఆముదం కలిపి పట్టించడం వల్ల కాలి పగుళ్ళు మటుమాయం అవుతాయి.

నేత్ర వ్యాధులు:- పరిశుభ్రమైన పసుపు కొమ్మును నీటితో సాది ఆ గంధాన్ని పెసర బద్ధంత మోతాదుగా కలిములాగా రోజు రాత్రి పూట వాడుతూ వుంటే నేత్ర వ్యాధులు హరిస్తాయి.




గడ్డలు, గాయాలు, బెనుకులు:- పసుపు గాని, పసుపు దంచిన ముద్దను గాని పైన వేసి కట్టడం వల్ల వ్రనములు, గడ్డలు, గాయాలు, బెనుకులు హరించి పోతాయి.

తల రోగములు:- పసుపు కొమ్మును గంధం తీసి పైన లేపనం చేసిన లేక పైన పట్టు లాగా వేసిన దాని మీద కాపడం పెట్టిన తలదిమ్ము, తల పోట్లు, పార్శ్వపు నొప్పి,  అపస్మారము శాంతిస్తాయి. పసుపు పూల రసం గాని ఆకుల రసం గాని వాడిన అదే ఫలితం కలుగుతుంది.


గోరుచుట్టు - మడమశీల:-  పసుపును సున్నపు నీటిలో ఉడక బెట్టి గాని లేక నూనెలో వుడకపెట్టి కాని పైన వేసి కడుతూ వుంటే గోరు చుట్టు, మడమ శూల, జెట్టలు, గడ్డలు  మొదలైనవి హరించి పోతాయి.


పురుగులకు:- పసుపు చూర్ణం నీటిలో కలిపి ఆ నీటిని ఇంట్లో చల్లితే పురుగులు నశించిపోతాయి.


స్పోటకం మచ్చలు :-  పసుపు, వేపాకు కలిపి ముద్దగా నూరి నూనె కలిపి వంటికి లేపనం చేస్తూ వుంటే స్పోటకం తాలుకు మచ్చలు, పుండ్లు మానిపోతాయి. ఇదే ప్రక్రియ ప్రకారం అనేక చర్మ వ్యాధులను సైతం అరికట్టవచ్చు.


దగ్గులు - పిల్లికూతలు:- వగర్పు దగ్గులు ,పిల్లి కూతలు మొదలైన శ్వాస కోశ వ్యాధులున్నవారు పసుపు కొమ్ములను నిప్పుల మీద కాల్చి చల్లార్చిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసి బుగ్గన పెట్టుకుని చప్పరించి దాని రసం మింగుతూ వుంటే దగ్గు ,పిల్లి కూతలు తగ్గుతాయి.

కనురెప్పలు రాలటం:-  నిమ్మపండుకు రంధ్రం చేసి అందులో పసుపు కొమ్మును దూర్చి 3 రోజులు నానబెట్టాలి. తరువాత దాన్ని తీసి ఎండబెట్టాలి. మళ్ళీ వేరొక నిమ్మపండులో దాన్ని గుచ్చి 3 రోజులుంచి తీసి ఎండబెట్టాలి. ఇలా చేసిన తరువాత బాగా ఎండిన ఆ పసుపు కొమ్మును నిలవ చేసుకుని రోజు రాత్రి నిద్ర పోయే ముందు కొంచెం నీటితో సాది ఆ గంధాన్ని కంటికి కాటుక లాగ పెట్టు కొంటూ వుంటే కంటి రెప్పలు ఊడిపోవడం ఆగిపోతుంది.

జలుబు, ముక్కు దిబ్బడ:- జలుబు అందరికి సాధారణంగా వేధించే సమస్య. దీని నివారణకు కూడా పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. నిప్పులపై పసుపు వేసి ఆ పొగను వాసన చూసినట్లయితే జలుబుకు చక్కని ప్రయోజనం ఉంటుంది. ఈ కాలంలో నిప్పులు లభించుట కష్టం కావున వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి అయినా పట్టుకోవచ్చు.

తేనె (Honey)

Ayurvedam
 తేనె (Honey)
కంటి మసకలకు:-  1.ఎండు కర్జూరము కాయ లోపలి గింజను మంచి తేనె తో సానరాయి మీద అరగదీసి ఆ గంధాన్ని పెసర గింజంత కంట్లో పెట్టుకొంటూ వుంటే కంటి మసకలు నివారింపబడతాయి .

2. మంచి మేలు రకమైన పట్టు తేనె 4 చెంచాలు ,మంచి మేలు రకమైన పచ్చ కర్పూరము 2 చిన్న పలుకులు కలిపి మెత్తగా నూరి గాజు బరిణి లో నిలువ ఉంచుకుని ,రాత్రి పూట కండ్లలో పెసర బద్ధంత పెట్టుకొంటూ వుంటే ,కండ్లలో కొంచెం నీరు కారిపోయి, కండ్లు తేటగా చల్లగా మారి, మసకలు కంటి దురదలు కూడా తగ్గిపోతాయి.

నేత్ర బలం:- రాత్రి నిద్ర పోయే ముందు తేనె (Honey), నీరుల్లి (Onion) రసం సమంగా కలిపి 2 చుక్కలు కంట్లో వేసుకొంటూ వుంటే నేత్ర దోషాలు నివారింపబడతాయి.


జలుబు-పడిశము:- రోజు 2 లేక 3 పూటలా అవసరాన్ని బట్టి 30 గ్రాముల  తేనె 25 గ్రాముల అల్లం రసం కలిపి తాగుతూ వుంటే జలుబు ,పడిశము 2 రోజుల్లోనే హరించి పోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.మలబద్ధకం కూడా నివారింపబడుతుంది .

శరీర స్థౌల్యము (స్థూలకాయము) తగ్గుటకు:- ప్రతి రోజు ఉదయం పరగడపున 20 గ్రాముల  తేనెను రాత్రి నిలువ వున్న నీటిలో కలిపి తాగుతూ వుంటే క్రమంగా శరీర స్థౌల్యము  తగ్గిపోతుంది.

బిళ్లలకు-గడ్దలకు:-  తేనె ,సున్నము ఈ రెండు సమంగా కలిపి నూరి శరీరం మీద లేచే బిళ్లలకు గాని, గడ్దలకు గాని పట్టు లాగ వేసి పైన పలుచటి నూలుగుడ్డ అంటిస్తూ వుంటే అవి కరిగిపోతాయి.

వాంతులు:- తేనె 20 గ్రాములు, దోరగా వేయించి దంచిన జీలకర్ర చూర్ణము 3 గ్రాములు  కలిపి ఒక మోతాదుగా రోజుకు 3 నుండి 5 సార్లు వ్యాధి తీవ్రతను బట్టి వాడుతూ వుంటే వాంతులు తగ్గిపోతాయి.

స్త్రీల ఎర్రబట్టకు:-  2౦ గ్రాముల తేనె , 1౦ గ్రాముల ఉసిరికాయ బెరడు చూర్ణము  కలిపి ఒక మోతాదుగా 2 పూటలా తింటూ వుంటే స్త్రీల ఎర్రబట్ట వ్యాధి తగ్గిపోతుంది.


కాళ్ళ పగుళ్ళకు:- తేనె మైనం 50 గ్రాములు, తీసుకుని చిన్న మంట మీద మరిగించి వడపోసి అందులో 100 గ్రాముల వెన్నపూస కలిపితే అది కూడా కరిగిపోయి, ఆ తరువాత ఆ రెండు పదార్ధాలు పేస్ట్ లాగ మారతాయి. ఆ పదార్ధాన్ని పాదాల పగుళ్ళకు లేపనం చేస్తూ వుంటే పగుళ్ళు తగ్గిపోయి పాదాలు నున్నగా అవుతాయి.

కంట్లో పువ్వులకు:- తేనె, లేత మునగాకు రసం సమభాగంగా కలిపి రోజు రాత్రి నిద్ర పోయే ముందు 2 చుక్కలు కంట్లో వేస్తూ వుంటే కంటి లోని పువ్వులు కరిగి పోతాయి.

నీరసం రోగం:- రోజు 2 పూటల అర గ్లాస్ మంచి నీళ్ళల్లో 30 గ్రాముల తేనె కలిపి తాగుతూ వుంటే నీరసం రోగం తగ్గిపోయి వంటికి మంచి బలం వస్తుంది.

మూత్రం కష్టంగా వస్తుంటే:- తేనె 15౦ గ్రాములు, మంచి మేలు జాతి పసుపు 50 గ్రాములు, కలిపి బాగా మెత్తగా నూరి నిలువ ఉంచుకుని రోజు 2 పూటల పూటకు 15 గ్రాముల మోతాదుగా సేవించి వెంటనే ఆవు పాలు తాగుతూ వుంటే మూత్రం బొట్టుబొట్టులా పడటం హరించి సాఫీగా వెలువడుతుంది.

దగ్గు:- తేనె 3 గ్రాములు, అల్లం రసం 6 గ్రాములు కలిపి ఒక మోతాదుగా, 2 పూటలా సేవిస్తూ వుంటే దగ్గు తగ్గిపోతుంది.

పిల్లల ఉదర పోటు:-  ప్రతి రోజు ఉదయం పరగడపున పావు గ్లాస్ నీళ్ళల్లో పావు చెంచా తేనె కలిపి తాగిస్తూ వుంటే పిల్లల గాలి పొట్ట కరిగిపోతుంది.

పిల్లల చిగుళ్ళ వాపు:-
పిల్లలకు దంతాలు వచ్చే ముందు చిగుళ్ళు వాస్తే నిప్పుల మీద పొంగించిన వెలిగారము ,తేనె కలిపి మెత్తగా నూరి కొద్ది పరిమాణము చిగుళ్ళ మీద పట్టిస్తూ వుంటే ఆ వాపులు తగ్గిపోతాయి.

నోటి దుర్గంధం:- పావు లీటర్ మంచి నీళ్ళల్లో 10 గ్రాములు తేనె కలిపి, ఆ నీటిలో రోజు 3 పూటలా పుక్కిలించి వూసివేస్తూ వుంటే నోటి దుర్గంధం హరించి పోయి నోరు పరిమలంగా వుంటుంది.

అంటు వ్యాధులకు:- తేనె మైనమును నిప్పుల మీద వేసి ఆ పొగను ఇంట్లో ప్రసరింపచేస్తూ వుంటే అంటూ వ్యాధులు సోకకుండా నివారింపబడతాయి. అందుకే ప్రతి రోజు చేసే యజ్ఞం లో తేనె వాడాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి.